ఏపీలో భూముల రీసర్వే చేపడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో చేపట్టిన సర్వేలో తప్పులు దొర్లాయంటున్న ప్రభుత్వం.. రీసర్వే చేపడుతోంది. ఇందులో భాగంగానే అనకాపల్లి జిల్లాలోని ఎంపిక చేసిన 63 గ్రామాలలో భూముల రీసర్వే చేపట్టనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ మూడు విడతల్లో రీసర్వే జరగ్గా.. జనవరి 2వ తేదీ నుంచి నాలుగో విడత భూముల రీసర్వే చేపట్టనున్నారు. గతంలో మాదిరిగా తప్పులు దొర్లకుండా పూర్తి కచ్చితత్వంతో సర్వే చేపట్టాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.