కరీంనగర్లో మొదటి ఇండోర్ సబ్స్టేషన్ (Indoor Sub Station) పనులు ప్రారంభమయ్యాయి. తక్కువ స్థలంలో అధిక సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు... రూ.551.97 లక్షల వ్యయంతో నగరంలోని విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచనుంది. అంతే కాకుండా.. పట్టణ ప్రజల విద్యుత్ అవసరాలను కూడా తీర్చనుంది. సాధారణంగా ఇప్పటివరకు ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణాలు కేవలం మహానగరాలకు మాత్రమే పరిమితం అయ్యేవి.. కానీ రాను రాను జిల్లాలకు కూడా ఇవి విస్తరిస్తున్నాయి.