ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. అయితే వేగం పుంజుకోకపోవడానికి కారణం.. భూ సేకరణ సమస్య. ఈ ప్రాజెక్టులు ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాతనే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల స్థలాలకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిర్మాణాలకు కావాల్సిన భూమిని ఇచ్చేందుకు యజమానులు ఒప్పుకోవడం లేదు. ధరలు అధికంగా ఉండటంతో.. ప్రభుత్వానికి స్థలాలు అప్పగించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే కదలికి వచ్చి.. ప్రాజెక్ట్ పనులు పూర్తి కానున్నాయి. ఇవన్నీ పూర్తయితే.. ఖమ్మం జిల్లా దశ తిరిగినట్లే.