హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 'శ్రీమద్ భాగవతం పార్ట్-1' చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ దేశానికే గర్వకారణమని, పౌరాణిక గ్రంథాల ఆధారంగా సినిమాలు తీయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఆకాష్ సాగర్ చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.