ఆ దొంగచేతికి తాళాలిస్తే... జగన్‌పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

1 year ago 23
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జగన్ ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాజధాని అమరావతి, పోలవరానికి ఎంతో నష్టం కలిగిందని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడిగా చరిత్రలో జగన్ నిలిచిపోయారని రామానాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా నీటిపారుదల శాఖలో అత్యవసర పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.380 కోట్లు నిధులు మంజూరు చేశారని చెప్పారు. తన నియోజకవర్గం పాలకొల్లులోని మూడు గ్రామాల్లో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
Read Entire Article