తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై రాష్ట్రంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు రూ.520 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యామ్ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.