తెలంగాణ దేవాదాయ శాఖ దూపదీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఎంపికైన ఆలయాలకు నెలకు రూ. 4,000, అర్చకులకు రూ. 6,000 వేతనం చెల్లిస్తారు. కనీసం 15 ఏళ్ల నాటి ఆలయాలు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగాలంటే దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకున్న ఈ చర్య ఎంతోమందికి ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవచ్చు.