ఆ పథకానికి దరఖాస్తులు ఆహ్వానం.. మే 24 చివరి తేదీ, నెలకు నేరుగా అకౌంట్లోకి రూ.6 వేలు..

1 year ago 35
తెలంగాణ దేవాదాయ శాఖ దూపదీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఎంపికైన ఆలయాలకు నెలకు రూ. 4,000, అర్చకులకు రూ. 6,000 వేతనం చెల్లిస్తారు. కనీసం 15 ఏళ్ల నాటి ఆలయాలు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగాలంటే దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకున్న ఈ చర్య ఎంతోమందికి ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవచ్చు.
Read Entire Article