తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టును తప్పుదోవపట్టించాలని చూసిన పిటిషనర్కు కోటి జరిమానా విధించింది. హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్ భూములకు సంబంధించి పటిషన్ పెండింగ్లో ఉంది. అయినా అతడు దానిని దాచి పెట్టి.. వేరే బెంచ్ వద్ద మరో పిటిషన్ వేసి.. ఆర్డర్ కూడా తీసుకున్నాడు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ న్యాయమూర్తికి రూ. కోటి జరిమానా విధించింది. అక్రమ మార్గంలో భూములను సొంతం చేసుకోవాలని చూసిన అతడికి హైకోర్టు చెక్ పెట్టింది.