Srikakulam Rice Pulling Gang: శ్రీకాకుళం జిల్లాలో ఇత్తడి చెంబు పేరుతో మోసం చేసే రైస్ పుల్లింగ్ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. 25 లక్షలకు ఇత్తడి చెంబును అమ్మేందుకు ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. ఇది అక్షయ పాత్ర అని, ఇంట్లో ఉంచుకుంటే కోట్లు వస్తాయని నమ్మించి మోసం చేయబోయారు. డబ్బులు చేతులు మారే సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి మొత్తం గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో చాలా మంది సభ్యులు ఉన్నారు.