వేములవాడ పట్టణ శివారు మల్లారం రోడ్డులోని లోలెవల్ వంతెన స్థానంలో హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తయింది. మూడేళ్ల క్రితం రూ.2.5 కోట్ల నిధులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఆలస్యమైంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పనులు వేగవంతమై, పది గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి.