ప్రైవేట్ భూ వివాదాలకు తాము దూరమని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. తుక్కుగూడలో వర్టెక్స్ సంస్థ చెరువులను ఆక్రమించగా.. వారిపై కేసులు నమోదు చేసి నిర్మాణాలు కూల్చివేశామని తెలిపారు. దళారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.