ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో మొత్తం 13 అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అమరావతిలో 343 ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చాలనే డ్రాఫ్ట్ బిల్లులో సవరణలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.