సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్, తాండూరు పట్టణాల్లో ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మిస్తుండగా.. ఈ రెండు పట్టణాల నుంచి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది.