బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్కు రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వరంగల్ సభ నిర్వహణ, బీజేపీపై విమర్శల తీవ్రత, భవిష్యత్ పొత్తు ప్రచారాలపై అసంతృప్తి, ప్లీనరీల నిర్వహణ ఆవశ్యకతను ఈ లేఖలో కవిత వ్యక్తం చేసినట్లు ఉంది. అయితే, లేఖలోని సంతకం కవితది కాదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తుండగా, ఆమె పాత లేఖలతో చేతిరాతను పోల్చుతూ కొందరు ఇది నిజమైన లేఖే అని అంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి ఈ లేఖను కేటీఆర్, హరీష్రావు రాశారని ఆరోపించారు.