Secunderabad Visakhapatnam Vande Bharat Schedule Changed: ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు అలర్ట్! సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు గురువారం బదులు సోమవారం రద్దు కానుంది. డిసెంబర్ 2 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. అలాగే, కాచిగూడ-యశ్వంత్పూర్ వందేభారత్ రైలు సర్వీసును బుధవారం బదులు శుక్రవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మార్పులు డిసెంబర్ 5 నుంచి అమలులోకి వస్తాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.