తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను పెంచి.. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగమే ఏటీసీల ఏర్పాటు. ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించి.. వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చారు. ఈక్రమంలో రేవంత్ రెడ్డి నేడు 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. యువతలో నైపుణ్య లోపాన్ని అధిగమించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే వీటి లక్ష్యమని తెలిపారు. మొత్తం 116 ఏటీసీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.