Resolving water disputes between telugu states: కృష్ణా, గోదావరి జలాల వినియోగ వివాద పరిష్కారానికి కేంద్రం చొరవ చూపింది. కేంద్ర మంత్రి పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. టెలిమెట్రీ అమలు, బోర్డుల నిర్వహణపై ఏకాభిప్రాయం కుదిరింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకరించింది. జల వివాదాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం సయోధ్యకు వేదికైందని రేవంత్ రెడ్డి తెలిపారు.