రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు మార్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు ఇది సరైన గౌరవం అని ఆయన అన్నారు. అంతేకాకుండా, బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని, తిరుమలకు వంద ఈవీ బస్సులు ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.