Fake Video On Cm Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోపై సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూరియా కొరతపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను డీప్ఫేక్ టెక్నాలజీతో మార్చి, తప్పుడు టైటిల్స్తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫిర్యాదు చేయగా, నారా లోకేష్ కూడా స్పందిస్తూ వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.