Vijayawada Passengers Vandebharat Trains Confused: విజయవాడ రైల్వే స్టేషన్లో వందేభారత్ రైళ్ల రాకతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఒకేసారి రెండు రైళ్లు పక్కపక్క ప్లాట్ఫాంలలో రావడంతో పొరపాటున వేరే రైలు ఎక్కేస్తున్నారు. ఒక ప్రయాణికుడు లోకో పైలట్ సహాయంతో తప్పు రైలు నుంచి దిగిపోయాడు. ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లను వేర్వేరు ప్లాట్ఫాంలలో కేటాయించాలని కోరుతున్నారు. ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్కు అదనపు కోచ్లు జోడించారు.. బోగీల సంఖ్యను 20కు పెంచారు.