రైళ్ల రద్దీని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో దేశంలోని 48 ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి రైళ్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నడిచే రైళ్ల సంఖ్య రెట్టింపు కానుంది. ప్రస్తుతం 37 రైళ్లు నడుస్తుండగా, ఈ సంఖ్య 74కు చేరుకుంటుంది. రూ.500 కోట్లతో స్టేషన్ అభివృద్ధి, ప్లాట్ఫారాల విస్తరణతో పాటు, కొత్త కోచింగ్ డిపో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.