Group-1 Interview Questions On Talliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకంపై గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు అడిగారు. ఈ పథకం పేద కుటుంబాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, విద్యా రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి వంటి అంశాలపై అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్రానికి పరిశ్రమల రాక వంటి అంశాలపై కూడా ప్రశ్నలు సంధించారు. తుది ఫలితాల కోసం APPSC ఎదురుచూస్తోంది.