Pm Narendra Modi Kurnool Tour: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ప్రధాని టూర్పై శాసనమండలిలో మంత్రులు, ఎమ్మెల్సీలతో చర్చించారు. వచ్చే నెలలో ప్రధాని ఏపీ పర్యటనకు వస్తున్నారని తెలిపారు. అక్టోబర్ 16న మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారని చెబుతున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని అనంతరం జరిగే రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఫుల్ షెడ్యూల్ త్వరలో విడుదలకానుంది.