Andhra Pradesh Paddy Procurement Money: మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లు, గొడౌన్ల నిర్వాహకులు, ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ మార్కెటింగ్ ప్రతినిధులతో విడివిడిగా మంత్రి సమీక్ష నిర్వహించారు. గొడౌన్లలో నిల్వ చేసే సరుకుల పర్యవేక్షణకు సివిల్ సప్లయిస్, ప్రైవేట్ గొడౌన్ల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పౌరసరఫరాల శాఖలో పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.