Andhra Pradesh Farmers Paddy Grain Till March: ఏపీ ప్రభుత్వం రైతుల ధాన్యం సేకరణపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెల వరకు ధాన్యం సేకరణ గడువును పొడిగించాలని నిర్ణయించారు. పలు జిల్లాల నుంచి రైతుల నుంచి రిక్వెస్ట్లు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. అలాగే రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే డబ్బుల్ని వారి అకౌంట్లలో జమ చేస్తున్నట్లు తెలిపారు.