ఆకివీడు: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామాలయ సందర్శనలో ఉద్రిక్తత.. కొంతమందికి గాయాలు!

4 weeks ago 4
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీరామనవమి సందర్బంగా పెదపేటలోని రామాలయం సందర్శనకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రావటం ఉద్రిక్తతలకు దారి తీసింది. రఘురామను అడ్డుకునేందుకు కొంతమంది యత్నించారు. అయితే పోలీస్ బందోబస్తు మధ్య ఆయన శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు.
Read Entire Article