ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఆటోడ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఆగస్ట్ 15న ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆరోజునే ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు.