దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా నాసిరకం చీరలు కాకుండా.. ఒక్కొక్కటి రూ.800 ఖరీదు చేసే రెండు చీరలను పంచనుంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఈ చీరల పంపిణీ ప్రారంభించనుంది. ఈ నెలలోనే మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి..