ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఇప్పటికే ఉన్న భూమితోపాటు మరింత భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎయిర్ఫోర్స్ వద్ద ఉన్న భూమి సరిపోదని.. మరింత సేకరించాలన్న ఏఏఐ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ ఎయిర్స్ట్రిప్కు అనుగుణంగా ఎయిర్పోర్టును నిర్మించనున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.