ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం పేరుతో ఓ మైనర్ బాలుడు (16), మైనర్ బాలికను బెదిరించి నగ్న వీడియోలను రికార్డు చేసి స్నేహితులకు పంపాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదైంది.