ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే పార్థసారథి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన తాజాగా ఆదోనిని ఎందుకు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారో వివరించారు. ఆయన చెప్పిన కారణాలు వింటే అవును కదా.. అనిపించకమానదు. కర్నూలు ఆదోని ప్రాంతాల మధ్య భౌగోళికంగా ఉన్న తేడాలను వివరించారు. అలానే ఆదోనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..