దేశంలోని నలుమూలల్లో స్థిరపడిన తోయిగూడ గ్రామస్తులు సొంతూరిపై ప్రేమలో నలభై ఏళ్ల తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువకులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆత్మీయ సమ్మేళనానికి ప్లాన్ చేశారు. దాంతో నాలుగు దశాబ్దాల తర్వాత 500 మందికి పైగా తోయగూడ గ్రామ శివారులో కలుసుకుని, ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మంచిచెడులు మాట్లాడుకున్నారు.