ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయం అయిపోయింది. ప్రజలు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర గణాంకాల శాఖ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 24.5 శాతం కుటుంబాలు ఆన్లైన్లో కొనుగోలు చేస్తుండగా.. తెలంగాణ 35.1 శాతం ప్రజలు ఈ కామర్స్ వెబ్సైట్లో వస్తువులు కొంటున్నారు. సౌత్ రాష్ట్రాల్లో తెలంగాణలో టాప్లో ఉండగా. పొరుగు రాష్ట్రం ఏపీ 23.4 శాతంతో చివరి స్థానంలో ఉంది.