మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట బుధవారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు డివిజన్ కమిటీ మెంబర్లు, నలుగురు ఏసీఎం క్యాడర్కు చెందినవారున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ చేయూత' లో భాగంగా వీరు జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 294 మంది మావోయిస్టులు లొంగిపోయారు.