పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసి లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది. దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ దాడిపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.