పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించేలా విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాడులు చేసింది. భారతదేశం తీసుకున్న చర్యకు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదన్ కుటుంబసభ్యులు ఆపరేషన్ సిందూర్ మీద స్పందించారు. ఉగ్రవాదులు అనే వారు లేకుండా చేయాలని కోరారు.