ఆపరేషన్ సిందూర్.. వారిని అదుపులోకి తీసుకోవాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు

10 months ago 36
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అప్రమత్తత ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా యంత్రాంగం పనిచేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలవులు రద్దు చేసి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలానే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Read Entire Article