హైదరాబాద్కు చెందిన 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి హనీ ట్రాప్కు గురై రూ. 38.73 లక్షలు కోల్పోయారు. ఫేస్బుక్లో మహిళ పేరుతో పరిచయం పెంచుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇంటర్నెట్ సౌకర్యం, అనారోగ్యం పేరుతో డబ్బులు వసూలు చేశారు. అనంతరం మైనర్ సోదరితో చాటింగ్ చేయించామని బెదిరించి.. నకిలీ పోలీసులు (కానిస్టేబుల్, ఎస్సై) పేరుతో బ్లాక్మెయిల్ చేశారు. బాలిక చదువు, తల్లి రుణం, కేసు సెటిల్మెంట్ల పేరుతో దశలవారీగా లక్షల రూపాయలు కాజేశారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.