ఆర్టీసీకి చెందిన పెట్రోల్ బంక్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలల్లోనే లక్షలాది రూపాయలను అందులో పనిచేసే సిబ్బంది కాజేశారు. ఈ భారీ స్కామ్ వెలుగులోకి రావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ జరిపి 29 మందిపై కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంక్లోని టెక్నికల్ లోపాలను గుర్తించిన సిబ్బంది.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. ఆర్టీసీ అధికారులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.