ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవం అందించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. వృద్ధులకు రాయితీలు, విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం, పరీక్షల సమయంలో ఉచిత ప్రయాణం వంటి సేవలతో ప్రజల మన్ననలు పొందుతోంది. సాంకేతికతను వినియోగించి, ఆన్లైన్ బస్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీఎస్ఆర్టీసీ, గతంలో ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇప్పుడు పల్లె వెలుగు బస్సులకు కూడా విస్తరించే ఆలోచన చేస్తోంది.