టీజీఎస్ఆర్టీసీ ఒక మంచి పనికి పూనుకుంది! ఇకపై రాష్ట్రంలో ఎవరైనా నేత్రదానం చేస్తే, వాటిని సరోజిని దేవి కంటి ఆసుపత్రికి ఉచితంగా చేర్చుతుంది. 'నెట్వర్క్ టు సైట్' పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల ఎంతోమంది చూపులేని వారికి వెలుగు వస్తుంది. సజ్జనార్ గారు కూడా నేత్రదానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ గొప్ప కార్యక్రమంలో మీరు కూడా పాలుపంచుకోండి!