Free bus Travel for Disabled persons in Andhra Pradesh: రాష్ట్రంలోని దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేశారు. దీంతో పథకం అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత శాఖ వద్దకు పంపించామని వెల్లడించారు. త్వరలోనే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.