తెలంగాణ ఆర్టీసీ ప్రయాణాలను సులభతరం చేస్తూ.. మొదట విద్యార్థుల బస్పాస్లను స్మార్ట్కార్డులుగా మార్చనుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. మహాలక్ష్మి పథకం మహిళలకు కూడా వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల స్మార్ట్కార్డుల వ్యవస్థను పరిశీలిస్తూ.. ఆన్లైన్ రెన్యూవల్, ఆధార్ కార్డు అవసరం లేకుండా ప్రయాణించే సౌలభ్యం కలగనుంది.