తనపై దుష్ప్రచారం, కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానని అన్నారు. పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని.. సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రజల అభిప్రాయాల మేరకే ప్రస్తావించానని చెప్పారు. తనను రెచ్చగొట్ట వద్దని.. రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ బీఆర్ఎస్లో అంతర్గత చర్చకు దారితీశాయి.