జమ్మూకాశ్మీర్లో వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించారు. తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరోవైపు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా తన నెల జీతం రూ.2.17 లక్షలను జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటించారు.