మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలేరు, భువనగిరి ప్రజల పాపం తగిలి కేసీఆర్ కాలు విరిగి ఫాంహౌస్ పాలయ్యారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. మిగులు బడ్జెట్ తెలంగాణను అప్పుల్లోకి కూరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. బస్వాపూర్, గందమల్ల ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రూ.697 కోట్లకు పైగా వ్యయంతో మొత్తం 18 రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.