ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని తమ ఓటును కాపాడుకోవాలని సూచించారు. విదేశాల్లో, ఇతర రాష్ట్రాలలో ఉన్నవారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చిందని.. ఈ నేపథ్యంలో వారందరూ ఇందులో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాల్పడాలని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.