షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన రాజ్కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. పెట్రోల్ అయిపోవడంతో కారును వదిలేసి రైల్వే ట్రాక్ వైపు వెళ్లిన అతడు.. ఆత్మహత్యాయత్నం విఫలమైన తర్వాత పరారైనట్లు అనుమానిస్తున్నారు. 3 ఫోన్లు, 12 సిమ్కార్డులను వినియోగించినట్లు గుర్తించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలు, హైవేలు, శ్రీశైలం, కర్ణాటక మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల బహుమతి ప్రకటించారు.