హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం (చేప మందు) పంపిణీ ప్రారంభమైంది. 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సాంప్రదాయ చేప మందు పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. మృగశిర కార్తి సందర్భంగా జూన్ 8, 9 తేదీల్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.