జనగామ జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లిని కూతురు, అల్లుడు కలిసి దారుణంగా హత్య చేశారు. లక్ష్మి అనే మహిళ తనకున్న భూమిని కూతురికి ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఆమెను నిద్రలో ఊపిరాడకుండా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది, ఆస్తి వ్యామోహంతో సొంత తల్లిని చంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.